పేకాట స్థావరంపై దాడి.. 9 మంది అరెస్ట్‌!

కలం, భూపాలపల్లి: ములుగు ఘనపూర్‌ (Mulugu Ghanpur) పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీతారాంపూర్‌ గ్రామ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్‌ బృందం మంగళవారం సాయంత్రం దాడి చేసింది. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి రూ.7,990 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 9 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఘనపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>