కలం, వరంగల్ బ్యూరో: భీమదేవరపల్లి (Bheemadevarapally) మండలం ములకనూర్లో బాలిక పై అత్యాచారం చేసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు శివకుమార్తో పాటు అతడికి సహకరించిన మణికంఠ, వేణు, గణేష్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు ములకనూర్ పోలీసులు తెలిపారు.

