కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan) దేశంలోని కరాచీ నగరంలో వరద బీభత్సం సృష్టించింది. భారీ వర్షం, ఈదురుగాలుల వల్ల సంభవించిన వరదల్లో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. వరదల వల్ల మావచ్ గోత్ ప్రాంతంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

