కలం, డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి (Srushti Case) టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు అయిన డాక్టర్ నమ్రతను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. కానీ కోర్టు రెండు రోజలు కస్టడీకి అనుమతించింది. సరోగసి పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడి.. కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో నమ్రత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మనీ లాండరింగ్, హవాలా కూడా జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఈ అంశాలపైనే నమ్రతను ప్రశ్నించేందుకు ఈడీ రెడీ అవుతోంది.
Read Also: జిల్లాల్లో కాంగ్రెస్ జెండా.. క్యాబినెట్ మరో బిగ్ డెసిషన్
Follow Us On : WhatsApp


