వాహన తనిఖీల్లో షాక్.. పోలీసులపైనే ఎటాక్!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారై (Manapparai) ప్రాంతంలో వాహన తనిఖీల సమయంలో తీవ్ర కలకలం రేగింది. మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు పోలీసులపై దాడికి తెగబడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనప్పారై పరిధిలో పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరగడంతో సదరు యువకుడు డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి.

పోలీసులపై దాడి చేసిన యువకుడిని అధికారులు వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సిసిటివి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. పోలీసు శాఖ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, అప్పుడే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also : ఇది కొత్త డేటింగ్ గురూ.. సూపర్‌ మార్కెట్స్‌కి క్యూ కడుతున్న సింగిల్స్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>