కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన బలమైన దాడుల ఫలితంగానే ఇరాన్ చివరకు లొంగిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో, పొరుగు దేశాల ముందు ఇరాన్ ఇలా ఓటమిని అంగీకరించి, క్షమాపణలు కోరడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఎటువంటి పరిస్థితుల్లోనూ పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ (Iran) హామీ ఇచ్చిందని, ఈ పరిణామం ఆ ప్రాంతంలో శాంతికి దారితీస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడానికి ప్రధానంగా కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాలను విస్తరించడం, సుదూర లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను పెంచుకోవడం తమ భద్రతకు ముప్పుగా భావిస్తున్నామని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా, హమాస్, హిజ్బుల్లా, హౌతీల వంటి సాయుధ గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇస్తూ, ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోందనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై సైనిక చర్యలను ప్రారంభించాయి.
Read Also: తల్లిని మోసం చేసి ఆస్తి రాయించుకున్న కన్న కూతురు
Follow Us On : WhatsApp

