కలం, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని తెలంగాణ టూరిజం విజయ విహార్ (Vijaya Vihar) అతిథి గృహంలో ఈ నెల 7 నుంచి ప్రతి శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు విజయ విహార్ మేనేజర్ కిరణ్ తెలిపారు. పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని టూరిజం వసతి గృహాల్లో పర్యాటకులను ఆహ్లాద పరిచేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్లోని తెలంగాణ టూరిజం గెస్ట్హౌస్ విజయ విహార్లోనూ ఈ నెల 7వ తేదీ నుంచి ప్రతి శనివారం బంజారా నృత్యాలు, కోలాటం లాంటి సంప్రదాయ కళలను సందర్శకుల కోసం ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. తెలంగాణ టూరిజం ‘స్వచ్ఛత’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయ విహార్ వసతి గృహం పరిసరాల్లో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

