కలం, వెబ్డెస్క్: రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) పంపిణీకి తేదీ ఖరారు చేసింది. ఆగస్డ్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డిలో జరుగనున్న కార్యక్రమంలో దీనిని ప్రారంభించనున్నారు. ఏక కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల ల్యామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. 119 నియోజకవర్గాల్లో పంద్రాగస్టున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కార్డుల పంపిణీ కార్యక్రమాలకు కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పంపిణీ ప్రక్రియ పూర్తయిన వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రేషన్ లబ్ధిదారుల జాబితాను ధృవీకరించాలని అధికారులకు సీఎం సూచించారు. రేషన్ కార్డుల ముద్రణ, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.

