కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టుకి దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న క్రమంలో హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏటీసీ సూచనల మేరకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపించారు. వాతావరణం అనుకూలిస్తే అర్ధరాత్రి సమయానికి తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే రాత్రికి బెంగళూరులోనే బస చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

