కలం, వెబ్డెస్క్: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండ మూల మలుపులో అదుపు తప్పి ఓ కారు లోయలోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా.. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దృశ్యాలు సీపీ కెమెరాలో రికార్డయ్యాయి.
డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ప్రమాద స్థలంలో మలుపుల వద్ద రక్షణ గోడ, సేఫ్టీ బారియర్స్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంటున్నారు. మలుపుల వద్ద రక్షణ ఏర్పాట్లు చేసి ప్రమాదాలు అరికట్టాలని అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

