కలం, ములుగు: మేడారం (Medaram)లో జరిగిన కారు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్లోని అమీర్ పేటకి చెందిన ఓ కుటుంబం శుక్రవారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి మేడారం వచ్చింది. దర్శనం అనంతరం విడిది చేస్తున్న గది వద్ద కౌశిక్ అనే బాలుడు ఆడుకుంటున్నాడు. కారులో ఉన్న నాలుగేళ్ల బాలుడు సాకేత్ కారు స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. ఈ ఘటనలో కౌశిక్ కారు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దైవ దర్శనానికి వస్తే బాలుడు మృతి చెందడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

