మోదీజీ.. యుద్ధం ఆపమని ట్రంప్​కు చెప్పండి : ఒవైసీ

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin) డిమాండ్​ చేశారు. శుక్రవారం హైదరాబాద్​లో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఎన్​డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ తీరును ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్​ చేశారు. యుద్ధం వద్దంటూ ట్రంప్​కు చెప్పాలని పేర్కొన్నారు.

అలాగే, విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్​ రివ్యూలో పాల్గొని, తిరిగి వెళుతున్న ఇరాన్​ యుద్ధనౌక ఐరిస్​ దేనాపై దాడికి సంబంధించిన అన్ని విషయాలను ప్రధాని వెల్లడించాలని డిమాండ్​ చేశారు. భారత ఆయిల్​ దిగుమతులపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్​ బెసెంట్​ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ ప్రస్తావిస్తూ.. దీనిపై బీజేపీ–ఆర్​ఎస్​ఎస్​ గట్టి బదులివ్వాలని అన్నారు. తనకు నచ్చిన చోట నుంచి ఆయిల్​ కొనే అధికారం భారత్​కు ఉందని అమెరికాకు గట్టి సమాధానమివ్వాలని ఒవైసీ(Asaduddin) డిమాండ్​ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>