కలం, వెబ్ డెస్క్: ఏపీ సర్కార్ (AP Govt) స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు ప్రారంభించింది. అన్నింటి కంటే ముందు మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తర్వాత ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో జూలై 27 నుంచి డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాలని సీఎం చంద్రబాబు (Chandrababu) టీడీపీ (TDP) నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. సుమారు 45 రోజుల పాటు ఈ ప్రచారం కొనసాగుతుంది. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

