కలం, వెబ్ డెస్క్ : నేడు (గురువారం) మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నెల్లూరు (Nellore) జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆయన జువ్వలదిన్నె (Juvvaladinne) గ్రామానికి చేరుకుని ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డు (Autonomous Maritime Shipyard) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ అత్యాధునిక మారిటైం షిప్ యార్డు పరిశ్రమను సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో ఈ ప్రాజెక్ట్కు సుమారు రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.
ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రాంతంలో 750 మందికిపైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అటానమస్ టెక్నాలజీతో నడిచే సముద్ర నౌకల తయారీ, అభివృద్ధికి ఈ షిప్ యార్డు కేంద్రంగా మారనుంది. సముద్ర రక్షణ, సర్వే, కమర్షియల్ రంగాల్లో వినియోగించే ఆధునిక నౌకల తయారీలో ఈ యార్డు కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నెల్లూరు (Nellore) జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

