రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. మండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు (YSRCP MLCs) నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీలు కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ లను ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించగా.. ఎమ్మెల్సీ జయమంగళం వెంకట రమణకు మాత్రం 25న విచారణకు హాజరు కావాలని మండలి ఛైర్మన్ మోషేను రాజు (Moshenu Raju) ఆదేశాలు జారీ చేశారు. విచారణలో భాగంగా రాజీనామా చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>