epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

అదే అజిత్​ దాదా స్పెషల్​!

కలం, వెబ్​డెస్క్​: ఎన్నికల్లో మహామహులు, ఉద్ధండులకైనా ఎప్పుడో ఒకసారి  ఓటమి తప్పదు. అయితే, అత్యంత అరుదుగా కొందరు నాయకులు మాత్రం విజయాన్నే తమ ఇంటి చిరునామాగా మార్చుకుంటారు. అలాంటి కోవకు చెందిన నాయకుడే అజిత్​ పవార్ (Ajit Dada)​. కార్యకర్తలు, అభిమానులందరూ ముద్దుగా ‘అజిత్​ దాదా’ అని పిలుచుకునే అజిత్ అనంతరావ్​ పవార్​.. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నాయకునిగా నిలిచారు. ఒక దఫా లోక్​సభకు, ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఈ క్రమంలో నాలుగు సార్లు మంత్రిగా, ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉండగానే, ఈ ఉదయం జిల్లా స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళుతూ బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ నేపథ్యం, రాజకీయాల్లో రాణించిన తీరు ఏంటంటే..

తాత వారసత్వం..

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా రాహూరి తాలూకా దేవ్​లాలి ప్రవరలో 1959 జులై 22న అజిత్​ పవార్ (Ajit Dada)​ పుట్టారు. తల్లిదండ్రులు అనంతరావ్​ గోవిందరావ్​ పవార్​, ఆశా తాయ్​ పవార్​. అజిత్​ తాత గోవిందరావ్​ పవార్, తన భార్య శారద పవార్​తో కలసి​ స్థానిక రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. వీళ్లకు ఏడుగురు కుమారులు, ఐదుగురు కూతుళ్లు. ఇందులో అజిత్​ పవార్​ చిన్నాన్న శరద్​ పవార్​ ఒకరు. ఈయన మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధండులు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ ప్రకారం అజిత్​ పవార్​ కుటుంబానికి మూడు తరాలుగా చాలా బలమైన రాజకీయ నేపథ్యం ఉంది.

అజిత్​కు ఒక అన్న శ్రీనివాస్​, సోదరి విజయ ఉన్నారు. అజిత్​కు సునేత్రతో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జై, పార్థ్​ ఉన్నారు.

జనతా దర్బార్​లు..

18 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన అజిత్​ కుటుంబ బాధ్యతలు మోస్తూనే.. బాబాయ్​ అండతో 22 ఏళ్లకు రాజకీయాల్లో అడుగుపెట్టారు. చాలా తక్కువ కాలంలోనే ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. వివిధ సహకార సంఘాలు, మిల్క్​ యూనియన్లు, చక్కెర ఫ్యాక్టరీలు, కోఆపరేటివ్​ బ్యాంకుల్లో పదవులు నిర్వహించారు. బారామతి నుంచి ఒకసారి ఎంపీగా, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి, ఉపముఖ్యమంత్రి అయ్యారు.

పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారు. దీనికోసం ఆయన ఎంచుకున్న మార్గం జనతాదర్బార్​. ప్రతి రోజూ కనీసం 16 నుంచి 17 గంటల పాటు ప్రజల కోసమే కేటాయించేవారు. కార్యకర్తలు, ప్రజలను సమానంగా గౌరవించేవారు.ఏదైనా పని సాధ్యమవుతుందని అనిపిస్తే ‘ఎస్’​ చెప్పేవారు. లేదంటే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేవారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం, సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అజిత్​ను మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి.

Read Also: రిజిస్ట్రేషన్‌శాఖలో మరిన్ని కీలక సవరణలు: పొంగులేటి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>