epaper
Wednesday, February 18, 2026
epaper

చితగ్గొట్టిన మార్క్​రమ్​ .. ప్రొటీస్​​ చేతిలో కివీస్​​ చిత్తు

కలం, వెబ్​డెస్క్​: టీ20 వరల్డ్​ కప్​లో (T20 World Cup) సౌతాఫ్రికా జోరు పెంచింది. ఆఫ్ఘనిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో త్రుటిలో ఓటమి తప్పించుకున్న ఆ జట్టు కివీస్​తో పోరులో దంచేసింది. శనివారం అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో కెప్టెన్ ​(Aiden Markram), ఓపెనర్​ మార్క్​రమ్​(86 నాటౌట్​; 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్​లు) చితగ్గొడంతో ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్​పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్​ చేసిన కివీస్​​ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్​ చాప్​మన్​(48; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్​లు) టాప్​ స్కోరర్​. డరైల్​ మిచెల్​(32; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్​), ఫిన్​ అలెన్​ (31; 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్​లు); జేమ్స్​ నీషమ్​(23 నాటౌట్​; 15 బంతుల్లో 3 ఫోర్లు) ఓ మోస్తరు పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్​సన్​ 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. కేశవ్​ మహారాజ్​, కార్బిన్​ బోష్​, లుంగి ఎన్​గిడి తలో వికెట్​ పడగొట్టారు.

ఛేదనలో మార్క్​రమ్ (Aiden Markram)​ విజృంభించాడు. ఓపెనర్​ క్వింటన్​ డికాక్​(20; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్​)తో కలసి తొలి వికెట్​కు 62 పరుగులు జోడించాడు. అనంతరం రియాన్​ రికెల్టన్ ​(21)తో కలసి రెండో వికెట్​ 40, డెవాల్డ్​ బ్రెవిస్​తో కలసి మూడో వికెట్​కు 29 పరుగులు జోడించాడు. డేవిడ్​ మిల్లర్​(24 నాటౌట్​)తో కలసి ఆఖరి వరకూ నిలిచి జట్టును గెలిపించాడు. సఫారీ జట్టు 17.1 ఓవర్లలో 178 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ​కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్​, నీషమ్​, రచిన్​ రవీంద్ర తలో వికెట్​ తీశారు. మార్కో యాన్​సన్​కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Read Also: ద్రవిడ్, కుంబ్లేకు ప్రత్యేక గౌరవం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>