కలం, కరీంనగర్ బ్యూరో: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ ఇళ్లపై ఏసీబీ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని మహారాజా బార్ వెనకాల ఉన్న ఒక ఇంట్లో, ఆర్టీసీ కాలనీలో మరో ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా లభ్యమైన నగదు, బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో లభ్యమైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

