కలం, వెబ్డెస్క్: ఢిల్లీ కాలుష్యం (Delhi Pollution)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధానిలో పొల్యూషన్ తీవ్రంగా ఉండడానికి అధిక ట్రాఫిక్ కూడా ఒక కారణమని పేర్కొంది. ఈ మేరకు ట్రాఫిక్ సమస్యపై జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)కి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. రాజధాని పరిధిలోని తొమ్మిది టోల్ ప్లాజాలను మరోచోటుకు మార్చాలని ఆదేశించింది. ఢిల్లీ కాలుష్యంపై వచ్చిన ఓ పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది.
Read Also: వారణాసి సెట్ చూడాలని ఉంది: అవతార్ డైరెక్టర్
Follow Us On: Youtube


