epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఆ విశ్రాంత ఉద్యోగికి పూర్తి మెడిక్లెయిమ్​ చెల్లించాల్సిందే: తెలంగాణ హైకోర్టు

కలం, వెబ్​డెస్క్​: ఓ విశ్రాంత ఉద్యోగికి మెడిక్లెయిమ్ రీయింబర్స్​మెంట్​ పూర్తిగా చెల్లించాల్సిదేనంటూ కేంద్రానికి తెలంగాణ హైకోర్టు (Telangana HC) ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్​ లాంటి అసాధారణ, అత్యవసర పరిస్థితిలో చికిత్స పొందిన విశ్రాంత ఉద్యోగికి, అతని భార్యకు సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ మెడిక్లెయిమ్​ ఎగ్గొట్టడానికి ప్రయత్నించడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ అపరేశ్​ కుమార్​ సింగ్​, జస్టిస్​ జి.ఎం.మొహియుద్దీన్​తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

ఆకాశవాణి హైదరాబాద్​ కేంద్రంలో వై.ఆదినారాయణ ఇంజనీరింగ్​ అసిస్టెంట్​గా పనిచేసి రిటైరయ్యారు.కొవిడ్ సమయంలో ఆ​ మహమ్మారి బారిన పడిన ఆయన, ఆయన భార్య ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బిల్లు మొత్తం రూ.21.39లక్షలు అయ్యింది. ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్​ఎస్​) కింద రీయింబర్స్ కోరుతూ ఆదినారాయణ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కేంద్ర ప్రసార సమాచార శాఖ కేవలం రూ.3.47లక్షలు మాత్రమే రీయింబర్స్ చేసి, మిగిలినది చెల్లించలేదు. దీనిపై సెంట్రల్​ అడ్మినిస్ట్రేటివ్​ ట్రిబ్యునల్​(క్యాట్​ను) ఆదినారాయణ ఆశ్రయించారు. క్యాట్​ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని ప్రసారభారతిని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టు (Telangana HC) ను ఆశ్రయించింది. పిటిషన్​ విచారణ సందర్భంగా కేంద్రం తీరును తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు… సదరు విశ్రాంత ఉద్యోగికి పూర్తి మెడిక్లెయిమ్​ చెల్లించాలని ఆదేశించింది.

Read Also: ‘ఉపాధి హామీ’ ఆత్మను చంపేసే కుట్ర

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>