epaper
Friday, January 16, 2026
spot_img
epaper

టీమ్ వర్క్‌తోనే గెలుపు.. టీ‌హబ్‌లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ 

కలం, వెబ్‌డెస్క్: స్టార్టప్ కంపెనీలు టీమ్ వర్క్‌తోనే సక్సెస్ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్టార్టప్ కంపెనీలను ఆయన ఫుట్‌బాల్ గేమ్‌తో పోల్చారు. హైదరాబాద్ స్టార్టప్ హబ్‌గా (Hyderabad Startup Hub) ఆవిర్భవించబోతున్నదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫుట్‌బాల్ గేమ్‌ను ఎలాగైతే టీమ్‌వర్క్‌తో గెలుస్తామే.. అలాగే స్టార్టప్ కంపెనీల్లోనూ విజయం సాధించవచ్చని చెప్పారు. గత 25 ఏండ్లలో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌లో చాలా స్టార్ట్ అప్స్ పెద్ద కంపెనీలుగా ఎదిగాయని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తు చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో‌ని టీహబ్‌లో నిర్వహించిన గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. పట్టుదలతో సాధన చేసినప్పుడే ఏదైనా సాధించగలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్ స్టార్ట్‌అప్ హబ్ కావాలి
హైదరాబాద్ స్టార్ట్‌అప్ హబ్ (Hyderabad Startup Hub) కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ ప్రొడక్ట్ బేస్డ్ స్టార్ట్ అప్స్, ఇన్నోవేటీవ్ స్టార్ట్ అప్స్, ఐపీ ఇంటెన్సివ్ స్టార్ట్అప్స్‌పై దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్ కేవలం స్టార్ట్ అప్ హబ్‌గా ఎదగడమే కాకుండా ఆ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్‌లు యూనికార్న్స్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. అంటే కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలుగా ఎదగాలని ఆకాంక్షించారు.  2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఒక మంచి ఎకోసిస్టమ్ కావాలి

రాష్ట్రంలో ఒక మంచి ఎకోసిస్టమ్‌ను సృష్టించాలనుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మీకు అవసరమైన సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నాయని చెప్పారు. స్టార్టప్‌ల కోసం మా ప్రభుత్వం రూ. 1000 కోట్లతో స్టార్ట్ అప్ ఫండ్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఆ ఫండ్స్ ను వినియోగించుకొని ఎదగాలని సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్ట్ అప్స్‌‌లో గూగుల్ ఒకటన్నారు. యువకులు, శక్తివంతులని.. కలలను సాకారం చేసుకొనే అవకాశం వారికి ఉంటుందని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఉదాహరణ చెప్పారు. ‘ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గారేజీలో ఓ స్టార్ట్ అప్‌ను ప్రారంభించారు. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించింది. తెలంగాణ భవిష్యత్ అభివృద్దిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ ను పరిచయం చేయాలని గత రెండు రోజులు, మనం తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌ను (Telangana Rising Global Summit) నిర్వహించాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ భవిష్యత్ విజన్ ఇదే..

జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్‌ను ఆవిష్కరించాం.  2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన అనేక స్టార్ట్ అప్స్ నేడు బిలియన్ల డాలర్ల కంపెనీలుగా ఎదిగాయి. గూగుల్, ఆపిల్, అమెజాన్, టెస్లా, ఫేస్‌బుక్ ఇలాంటి గొప్ప ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. గత 25 సంవత్సరాల్లో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో. హైదరాబాద్‌లో చాలా స్టార్ట్-అప్స్ పెద్ద కంపెనీలుగా ఎదిగాయి.’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: దీపావళికి యునెస్కో విశ్వఖ్యాతి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>