కలం, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ (GHMC) పునర్విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పులు రూ. 4,780 కోట్ల ప్రభుత్వమే పూర్తిగా టేకోవర్ చేయనుంది. బల్దియాను మూడు కొత్త కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో ఈ అప్పుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, కొత్తగా ఏర్పడే కార్పొరేషన్లపై ఈ అప్పుల భారం పడితే అవి ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమవుతుందని భావించిన ప్రభుత్వం (Telangana Govt) ఆ బాధ్యతను స్వీకరించి చెల్లింపులు జరిపేందుకు సిద్ధమైనట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Also: హాస్టల్ విద్యార్థినులను కరిచిన ఎలుకలు
Follow Us On: Instagram

