కలం, వెబ్ డెస్క్ : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేక పరిశీలకులుగా ఇద్దరు నేతలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్ ను (Ponnam Prabhakar) ప్రత్యేక పరిశీలకులుగా నియమించినట్లు AICC ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణలో ఈ ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించనున్నారు. పార్టీ వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో వారు ప్రత్యేకంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Read Also: తెలంగాణ IPS కు అమిత్ షా బంపర్ ఆఫర్
Follow Us On: Sharechat

