కలం, డెస్క్ : తిరుమల (TIrumala) క్యూలైన్లలో భక్తులు కొట్టుకోవడం సంచలనంగా మారింది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న కృష్ణతేజ గెస్ట్ హౌస్ దగ్గర్లోని క్యూలైన్ లో సోమవారం వేచి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు భక్తుల మధ్య వ్యక్తిగత దూషణలు కాస్తా.. కొట్టుకోవడం దాకా వెళ్లింది. ఓ భక్తుడు అందరి ముందే బెల్ట్ తీసి అవతలి వ్యక్తిని కొట్టాడు. దీంతో ఘర్షణ కాస్తా పెద్దదిగా మారింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, సేవకులు వచ్చి వారిని ఆపారు. ఈ ఘటనపై టీటీడీ రియాక్ట్ అయింది. దర్శనాల కోసం వచ్చే భక్తులు ఇలా కొట్టుకోవడం సరైంది కాదంటూ తెలిపింది. అందరూ క్యూలైన్ రూల్స్ ను పాటిస్తూ దర్శనం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

