కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) బాధ్యతలు స్వీకరించారు. దీనితో పాటు ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లో కూడా మార్పులు జరిగాయి.
గత కొంతకాలంగా IRGC గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్గా సేవలందించిన మహమ్మద్ పక్పౌర్ మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఆయన మృతితో ఖాళీ అయిన IRGC చీఫ్ స్థానంలో అహ్మద్ వహిదీని కొత్తగా నియమించారు. ఇరాన్ రక్షణ, రాజకీయ వ్యవస్థలో ఈ పరిణామాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read Also: ఇరాన్పై దాడులను ఖండించిన న్యూయార్క్ మేయర్
Follow Us On: X(Twitter)

