కలం, వెబ్ డెస్క్: సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ (CJI Surya Kant) నేడు ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీజేఐ తిరుపతిలో నేడు కొత్త కోర్టు భవనాలకు, అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రేపు సాయంత్రం విజయవాడలో జరిగే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సదస్సులో పాల్గొంటారు. అక్కడ న్యాయమూర్తుల నివాస గృహాలను కూడా ప్రారంభించనున్నారు.

