కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని సచివాలయంలో మార్చి 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన కలెక్టర్ల సమావేశం (Collectors Conference) వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలోని ఏడో అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ఈ భేటీ నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ను మార్చి 4 లేదా 5 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా కొత్త తేదీని ప్రకటించనుంది.
Read Also: సైనికుల దివ్యాంగ పెన్షన్పై టాక్స్ అవమానకరం : రాహుల్
Follow Us On: X(Twitter)

