epaper
Friday, January 16, 2026
spot_img
epaper

యాంకర్ శివజ్యోతిపై జీవిత కాల నిషేధం

టీవీ యాంకర్ శివజ్యోతి(Anchor Shiva Jyothi)పై టీటీడీ జీవితకాల నిషేధం విధించింది. తిరుమల ప్రసాదంపై శివజ్యోతి, ఆమె తమ్ముడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శివజ్యోతి ఆధార్ కార్డ్‌ను బ్లాక్ చేస్తూ జీవితంలో ఆమె ఎప్పుడూ శివజ్యోతి.. తిరుమల వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకోకుండా నిషేధం విధించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమల లడ్డూ నాణ్యత, నిర్వహణపై సోషల్ మీడియాలో శివ జ్యోతి(Anchor Shiva Jyothi) తమ్ముడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. భక్తుల భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయని భావించిన టీటీడీ, వెంటనే విజిలెన్స్ విభాగం ద్వారా విచారణ ప్రారంభించింది. దర్యాప్తు అనంతరం టీటీడీ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించి శివ జ్యోతి ఆధార్ బ్లాక్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమెకు ఇకపై ఈ-దర్శనం, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం సహా ఏ విధమైన దర్శనానికి అనుమతి లేకుండా పోయింది. “దేవస్థానం, శ్రీవారి ప్రసాదం, సేవలు, ఆలయ సంప్రదాయాలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే నిబంధనల ప్రకారం శిక్ష తప్పదు” అని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

Read Also: ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా? జైలు అధికారుల క్లారిటీ

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>