కలం, వెబ్ డెస్క్: వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) రావడంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. బొత్స అస్వస్థకు గురైన సమాచారం తెలుసుకున్న వెంటనే పలువురు వైసీపీ నేతలు హైదరాబాద్ తరలివెళ్లారు. నిన్న మొన్నటి వరకు మండలి సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్న బొత్స సత్యనారాయణ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంపై వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

