కలం, వెబ్ డెస్క్ : ఇటీవల రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు (Maoist Leaders) నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ భేటీకి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ముఖ్యమంత్రితో భేటీ కావడానికి ముందు డీజీపీ శివధర్ రెడ్డి ఐజీ సుమతి సీఎంను కలిసి ఈ ప్రక్రియపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో లొంగిపోయిన ప్రముఖ నేతలు దేవ్ జీ (Devji) అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (Sangram), చంద్రన్న, సుజాతక్క, దామోదర్ అలియాస్ బడె చొక్కారావు, నూనె నరసింహారెడ్డి పాల్గొంటారు. ప్రభుత్వ సలహాదారుడు కే కేశవరావు కూడా ఈ చర్చల్లో భాగస్వామి అవుతుండటం విశేషం.
Read Also : లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్
Follow Us On: Instagram

