epaper
Sunday, March 1, 2026
epaper

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంట‌ర్‌.. ఇద్ద‌రు మావోయిస్టులు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మ‌రోసారి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌ (Maoists)కు మ‌ధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంద్రావతి నది పరిధిలో గురువారం ఉదయం జ‌రిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మావోస్టులు మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టులు న‌దీ తీరంలో ఉన్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో భ‌ద్ర‌తా ద‌ళాలు, పోలీసులు సంయుక్త ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల‌ అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించ‌గా ఇద్ద‌రు మావోయిస్టుల మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. ఘ‌ట‌నా స్థ‌లంలో భారీ ఎత్తున రైఫిళ్లు, ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొన‌సాగుతోంది. పూర్త‌యిన త‌ర్వాత వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు. దేశంలో మావోయిస్టుల‌ను పూర్తిగా తొల‌గిస్తామ‌న్న కేంద్రం ఆప‌రేష‌న్ క‌గార్‌ను వేగ‌వంతం చేసింది. మార్చి 31 వ‌ర‌కు భార‌త్‌ను మావోయిస్టులు లేని దేశంగా ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!