epaper
Wednesday, February 18, 2026
epaper

రేవంత్​కి అనుకూలంగా పనిచేస్తున్న ఎస్​ఈసీ : ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​

కలం, వెబ్​ డెస్క్​ : సీఎం రేవంత్​ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుకూలంగా పనిచేస్తున్నదని బీఆర్ఎస్​ నాయకుడు ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్​ ఫలితాలు.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవడానికి కాంగ్రెస్​ చేస్తున్న వ్యూహాలపై ఆయన స్పందించారు. ఎన్నికలలో పదవులు గెలుపొందడానికి కాంగ్రెస్​ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) పోలీస్​ శాఖను దగ్గర పెట్టుకుని ఎన్నికలను అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. అయినా మున్సిపాలిటీ ఎలక్షన్లలో బీఆర్​ఎస్​ పార్టీ 30 శాతం ఓట్లను కొల్లగొట్టిందన్నారు. కాంగ్రెస్​ పార్టీకి 15 లక్షల ఓట్లు వస్తే.. గులాబీ పార్టీకి 10 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలే నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్​ ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మూడు రోజుల ముందే ఎస్​ఈసీ నోటిఫికేషన్​ విడుదల చేసిందని, కనీసం 15 రోజులన్నా సమయం ఇవ్వాల్సి ఉందని ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్ (RS Praveen)​ అభిప్రాయపడ్డారు.

Read Also: సీఎం రేవంత్​పై రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>