కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంలో కార్మికులు భయాందోళన నెలకొంది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం దోతిగూడెంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దోతిగూడెంలో ఉన్న బృందావన్ ల్యాబ్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదం నుంచి కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఒక బ్లాక్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


