కలం, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్–2026లో అఫ్గానిస్థాన్ జట్టుకు షాక్ తగిలింది. అఫ్ఘానిస్థాన్ స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ (Mohammad Nabi) కి ఐసీసీ భారీ జరిమానా విధించింది. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో అంపైర్లతో వాగ్వాదానికి దిగడమే ఇందుకు కారణం. అతడి ప్రవర్తనపై చర్యల్లో భాగంగా మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఒక డిమెరిట్ పాయింట్ కూడా నమోదు చేసింది. ఈ ఘటన బుధవారం జరిగిన మ్యాచ్లో చోటుచేసుకుంది. అఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ సమయంలో వివాదం ప్రారంభమైంది.
సౌతాఫ్రికా పేసర్ లుంగీ ఎన్గిడి చేతికి వేసుకున్న రిస్ట్ బ్యాండ్పై నబీ (Mohammad Nabi) అభ్యంతరం వ్యక్తం చేశారు. బంతిని గుర్తించడంలో ఇబ్బంది కలుగుతోందని ఆయన అంపైర్ల దృష్టికి తీసుకెళ్లారు. రిస్ట్బ్యాండ్ తొలగించాలని సూచించారు. ఈ సమయంలో అంపైర్లు జోక్యం చేసుకున్నారు. అయితే వారి సూచనలను నబీ పాటించలేదని గుర్తించారు. దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4 ఉల్లంఘనగా పరిగణించారు.
అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ల ఆదేశాలను పాటించకపోవడమే ఈ ఆర్టికల్కు సంబంధించిన అంశమని అధికారులు తెలిపారు. 41 ఏళ్ల నబీపై లెవల్ 1 నేరంగా కేసు నమోదు చేశారు. దాంతో మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఒక డిమెరిట్ పాయింట్ జోడించారు. ఈ ఘటనతో అఫ్గానిస్థాన్ జట్టు దృష్టి ఇప్పుడు టోర్నమెంట్పై నిలిచింది. నియమావళి ఉల్లంఘనలపై ఐసీసీ కఠినంగా వ్యవహరిస్తోందన్న సంకేతాలు మరోసారి స్పష్టమయ్యాయి.
Read Also: పాతబస్తీలో రౌడీ షీటర్ వీరంగం.. రోడ్డుపై కత్తులతో దాడి
Follow Us On: Youtube


