epaper
Wednesday, February 18, 2026
epaper

గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు తరలింపు

కలం, వెబ్​ డెస్క్​ : వైసీసీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ను పోలీసులు గుంటూరు కోర్టుకు (Guntur Court) తరలించారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయన బెయిల్​ రాగా, పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 2023లో అంబటి నిర్వహించిన లక్కీ లాటరీపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇప్పుడు పిటీ వారెంట్​ జారీ చేశారు. దీంతో పీటీ వారెంట్​ పై విచారించడానికి అంబటిని రాజమండ్రి జైలు నుంచి గుంటూరు జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్​ సీనియర్​ సివిల్​ కోర్టులో పిటీ వారెంట్​ పై అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు హాజరుపరచనున్నారు.

సీఎం చంద్రబాబుపై అంబటి (Ambati Rambabu) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. దీంతో అంబటిని పోలీసులు జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్​ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్​ తో పాటు మరో పాత కేసులో వారెంట్​ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కక్ష్య పూరితంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also: సీఎస్‌గా వికాస్‌రాజ్?.. సర్కారు ప్రకటనే తరువాయి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>