epaper
Wednesday, February 18, 2026
epaper

గిగ్ వర్కర్స్ సమ్మె.. ప్రయాణికుల ఇక్కట్లు..!

కలం, మెదక్ బ్యూరో: యాప్ కంపెనీలు ఇష్టానుసారంగా ఛార్జీలు నిర్ణయించడం, డ్రైవర్ల(Drivers)ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంగారెడ్డి(Sangareddy) జిల్లా అమీన్ పూర్, పటాన్ చెరు, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ యూనియన్ల ఆధ్వర్యంలో యాప్ కంపెనీల వైఖరిపై నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు 6 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ‘ఆలిండియా బ్రేక్‌డౌన్’ పేరుతో జరుగుతున్న సమ్మెలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డ్రైవర్లు యాప్‌ల నుంచి లాగ్ అవుట్ అయ్యారు. దీంతో ఓలా(Ola) ఉబర్(Uber), రాపిడో(Rapido), పోర్టర్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడింది. యాప్ కంపెనీలు తమ ఇష్టానుసారంగా ఛార్జీలు తగ్గించకుండా, డ్రైవర్ల యూనియన్లతో చర్చించి ధరలను ఖరారు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>