కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈఎన్సీ జనరల్ గా ఓలేటి వెంకట రమేశ్ బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించనున్నది. ఇక ఈఎన్సీ (ఇంజినీర్-ఇన్-చీఫ్) జనరల్ గా ఉన్న మహ్మద్ అంజద్ హుస్సేన్ పదవీ కాలం పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే, ఈలోగా రమేశ్ బాబుకు పూర్తి అదనపు స్థాయి బాధ్యతల (ఎఫ్ఏసీ)ను ప్రభుత్వం అప్పగించనున్నది.


