కలం, వెబ్ డెస్క్: మద్రాస్ హైకోర్ట్(Madras High Court)లో ఓ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్(Vijay)కి చుక్కెదురైంది. గతంలో విజయ్ రూ.15 కోట్ల సంపాదనకు సంబంధించి ఆదాయ పన్ను శాఖకు లెక్కలు చూపించలేదు. ఈ విషయం 2015లో ఆయన ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ విజయ్కి రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. దీనిపై విజయ్ మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ అంశంపై హైకోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం విజయ్ వేసిన విన్నపాన్ని తిరస్కరించింది. ఆదాయ పన్ను శాఖ సెక్షన్ 263 ప్రకారం షో కాజ్ నోటీసులు జారీ చేసినట్లు కోర్ట్ వెల్లడించింది. నోటీసు ఇవ్వడంలో ఎలాంటి లోపం లేదని తెలిపింది. విజయ్ జరిమానా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.


