epaper
Wednesday, February 18, 2026
epaper

మణిపూర్​లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

కలం, వెబ్​డెస్క్​: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ​(Manipur) లో రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే యమ్నం ఖేమ్​చంద్​ సింగ్​ను మణిపూర్​ బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న కాసేపటికే రాష్ట్రపతి పాలన తొలగిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

మైతేయి (Meitei), కుకీల (Kuki) మధ్య చెలరేగిన జాతుల ఘర్షణతో గతేడాది మణిపూర్​ సీఎం బీరేన్​ సింగ్​ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రెసిడెన్సీ రూల్​లో ఉన్న మణిపూర్​లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కేంద్రంలోని బీజేపీ భావించింది. అందుకు అనుగుణంగా అడుగులు పడ్డాయి. ఖేమ్​చంద్​ సీఎంగా, నెమ్చా కిప్​గెన్​ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలో ఖేమ్​చంద్​ను బీజేపీ తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంది. అనంతరం ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామంటూ గవర్నర్​ అజయ్​ భల్లాను సంప్రదించారు. దీంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను తొలగించింది. ఖేమ్​చంద్​ ముఖ్యమంత్రిగా మణిపూర్​ (Manipur) లో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

Read Also: విద్యుత్ స్తంభాలు, గృహ కనెక్షన్లపై కీలక మార్పులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>