కలం, వెబ్ డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి (Actor Raghunath Reddy) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం రాత్రి ఆయన నివాసంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
రఘునాథ్ రెడ్డి తన కెరీర్లో 370కి పైగా సినిమాలు, పలు టీవీ సీరియళ్లలో నటించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సినిమాల్లో తండ్రి పాత్రల్లో, సహాయ నటుడిగా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Read Also: రాంచరణ్, ఉపాసన దంపతులకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు
Follow Us On: Pinterest


