కలం, తెలంగాణ బ్యూరో : రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైల్ కారిడార్లను (Rail Corridors) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో మూడు తెలంగాణ (Telangana) కేంద్రంగానే ఉండనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కూడా కేటాయించింది. ఇప్పటికే వందేభారత్, వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్, బుల్లెట్ రైల్ తదితరాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇకపైన ప్రత్యేకంగా హైస్పీడ్ రైల్ కారిడార్లను తీసుకురానున్నది. తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని పదేపదే బీజేపీ ప్రకటిస్తున్న సమయంలో మొత్తం ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడింటిని తెలంగాణపై ఫోకస్ పెట్టి ప్లానింగ్ చేయడం గమనార్హం.
ఆ కారిడార్లు ఇవే :
హైదరాబాద్-బెంగళూరు
హైదరాబాద్-చెన్నై
హైదరాబాద్-పూణె
బెంగళూరు-చెన్నై
ఢిల్లీ-వారణాసి
వారణాసి-సిలిగురి
ముంబయి -పూణే
Read Also: నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్
Follow Us On : WhatsApp


