epaper
Friday, January 30, 2026
spot_img
epaper

నిజాం నగలను హైదరాబాద్​కు పంపే ఆలోచన లేదు: కేంద్రం

కలం, వెబ్​డెస్క్​: రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) వద్ద నిజాం నగలు (Nizam Jewels) సురక్షితంగా ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్​సీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్​ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అత్యంత విలువైన 173 నిజాం నగలు 1995 నుంచి ఆర్​బీఐ వాల్ట్స్​లో భద్రంగా ఉన్నాయని చెప్పారు.

‘నిజాం నగలు చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ప్రాధాన్యం ఉన్నవి. ఈ కళాఖండాల పరిరక్షణను సాంస్కృతిక శాఖ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం వీటి భద్రత, పరిరక్షణ, బీమా కోసం ఆర్​బీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, వీటిని అత్యంత భద్రత కలిగిన ఆర్​బీఐ వాల్ట్స్​లో ఉంచాం’ అని ఆయన వెల్లడించారు. అయితే, వీటిని తిరిగి హైదరాబాద్​కు పంపే విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదని కేంద్ర మంత్రి (Gajendra Singh Shekhawat ) స్పష్టం చేశారు.

కాగా, నిజాం నగలను (Nizam Jewels) హైదరాబాద్​కు తిరిగి తీసుకురావాలని ఆయన వారసులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రికి సైతం వాళ్లు అనేకసార్లు విజ్ఙప్తి చేశారు. మరోవైపు నిజాం కాలం నాటి అనేక ఇతర ఆభరణాలు, అపురూప వస్తువులు హైదరాబాద్​లోని పురాతన సాలార్​ జంగ్​ మ్యూజియంలో ఉన్నాయి.

Read Also: బీహార్ ప్రభుత్వం కీలకం నిర్ణయం.. ఉద్యోగుల సోషల్ మీడియాపై ఆంక్షలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>