epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

అజిత్​ పవార్​ మృతిపై అనుమానాలు : మమతా బెనర్జీ

కలం, వెబ్​ డెస్క్​ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో మరణించడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ విషాద ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆమె పేర్కొన్నారు. దేశంలో సామాన్య ప్రజలకే కాకుండా రాజకీయ నాయకులకు కూడా భద్రత కరువైందని ఆమె పేర్కొన్నారు.

అజిత్ పవార్ తిరిగి తన సొంత పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం లేదని, అందుకే ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. తమకు కేవలం అత్యున్నత న్యాయస్థానంపైనే పూర్తి విశ్వాసం ఉందని ఆమె తెలిపారు.

Read Also: ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా.. రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>