కలం, వెబ్ డెస్క్: బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar), మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ బుధవారం బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఓ సభ కోసం బయలుదేరారు. అజిత్ పవార్ విమానం బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎయిర్ పోర్ట్ సిబ్బంది అజిత్ పవార్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అజిత్ పవార్ తో పాటు విమానంలో ప్రయాణించిన మరో ఐదుగురు మృతి చెందినట్లు డీజీసీఏ నిర్ధారించింది.


