కలం, వెబ్డెస్క్: బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్ (Arijit Singh) షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ప్లేబ్యాక్ సింగింగ్ కెరీర్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. గాయకుడిగా ఇప్పటివరకు తన జర్నీ అద్భుతంగా కొనసాగిందన్నారు. ఇంతకాలం తన పాటలను ఆస్వాదించిన, తనను ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ప్రేమ, అభిమానం చూపిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. అయితే, రిటైర్మెంట్కు కారణాన్ని ఆయన వెల్లడించలేదు. సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా పాటలు పాడకపోయినప్పటికీ ప్రైవేట్ ఆల్బమ్స్కు, ఈవెంట్స్కు, ఇతర కార్యక్రమాల్లో అరిజిత్ పాటలు పాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా జియాగంజ్లో 1987, ఏప్రిల్ 25న కక్కర్ సింగ్, అదితి సింగ్ దంపతులకు అరిజిత్ సింగ్ (Arijit Singh) పుట్టారు. ఓ టీవీ చానల్లో ప్రసారమైన ‘ఫేమ్ గురుకుల్’ రియాలిటీ షో ద్వారా గాయకుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2011లో హిందీ సినిమా ‘మర్డర్ 2’లోని ‘ఫిర్ మొహబ్బతే’ పాట ద్వారా బాలీవుడ్లో ప్రవేశించారు. 2013లో విడుదలైన ‘ఆషికీ 2’ సినిమాలోని ‘తుమ్ హి హో’ పాట అరిజిత్కు ఫిల్మ్ఫేర్తోపాటు అనేక అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టింది.
అనంతరం 2018లో రిలీజైన పద్మావతి సినిమాలోని ‘బింతే దిల్’ పాటకు ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. 2022లో బ్రహ్మాస్త్ర పార్ట్–1 సినిమాలోని ‘కేసారియా’ పాటకు రెండోసారి నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందారు. ఎంతో ప్రతిభ ఉన్న అరిజిత్ 38 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగింగ్కు అల్విదా చెప్పడంపై ఆయన అభిమానులతోపాటు బాలీవుడ్ సైతం షాక్కు గురైంది.
Read Also: సంజూ శాంసన్కు మరో ఛాన్స్.. ఆశలు ఇంకా ఉన్నాయి !
Follow Us On: Pinterest


