కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం (Nampally Fire Accident) సంభవించింది. స్టేషన్ రోడ్డులోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు పైకి వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఇద్దరు చిన్నారు సహా మొత్తం ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
బిల్డింగ్ లోపల చిక్కుకున్న ఐదుగురిని రక్షించేందుకు అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. వీరిలో ఇద్దరు 12 ఏళ్లలోపు ఉన్నట్లు సమాచారం. 10 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది.. సెల్లార్ లో మొత్తం ఫర్నీచర్ ఉండడంతో వారిని రక్షించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చిక్కుకున్న వారిని గుర్తించడానికి రోబోను బిల్డింగ్ లోకి పంపించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సీపీ సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇంకా రెండు గంటలయితే కానీ, పరిస్థితి గురించి చెప్పలేమని సీపీ సజ్జనార్ వెల్లడించారు. పైకి షాపులా కనబడుతున్నా లోపల మొత్తం దూది, స్పాంజ్, చెక్క, ఆయిల్ తో నింపేయడంతో లోపలకి వెళ్లడానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. జేసీబీ సహాయంతో వాటిని అధికారులు తొలగిస్తున్నారు. మరోపక్క తమ పిల్లలు ఎలా ఉన్నారో చెప్పాలని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
Read Also: క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేకపోతున్నారా.. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గదు..!
Follow Us On: Pinterest


