epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

ఇషాన్​, సూర్య ధనాధన్​.. రెండో టీ20లో సూపర్​ విన్

కలం, వెబ్​డెస్క్​: కివీస్​తో రెండో టీ20లో ఇండియా సూపర్​ విన్​ సాధించింది. గెలుస్తుందా లేదా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ అద్భుత విజయం సాధించింది.  ఇషాన్​ కిషన్​ (76; 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్​లు), కెప్టెన్​ సూర్యకుమార్ (Surya kumar Yadav)​ యాదవ్​  (82 నాటౌట్​; 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్​లు) ధనాధన్​ అర్ధసెంచరీలతో చెలరేగడంతో రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాయ్​పూర్​ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​ చేసిన కివీస్​ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. మిచెల్​ శాంట్నర్​(47 నాటౌట్​; 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్​), రచిన్​ రవీంద్ర(44; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్​లు) టాప్​ స్కోరర్లు. భారత బౌలర్లలో చైనామన్​ బౌలర్​, స్పిన్నర్​ కుల్​దీప్​ యాదవ్ 2 వికెట్లు తీయగా, శివం దూబె, వరుణ్​ చక్రవర్తి, హర్షిత్​ రాణా, హార్థిక్​ పాండ్యా తలో వికెట్​ పడగొట్టారు.

ఛేదనలో మొదట భారత్​ తడబడింది. 6 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సూపర్​ ఫామ్​లో ఉన్న అభిషేక్​ శర్మ(0) డకౌట్​ కాగా, సంజూ శాంసన్​ (6) సైతం వెంటనే వెనుదిరిగాడు. ఆరంభంలో పరిస్థితి చూస్తే భారత్​ గెలుపు కష్టమే అని అనిపించింది. కానీ, సూర్యకుమార్​ తోడుగా ఇషాన్​ కిషన్​ చెలరేగిపోయాడు. సిక్స్​లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 21 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, మరింత ధాటిగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 128 వద్ద మూడో వికెట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్యకు శివమ్​ దూబె జత కలిశాడు.

ఇషాన్​ అవుటయ్యాక బాదుడు బాధ్యత తీసుకున్న స్కై (Surya kumar Yadav).. సిక్స్​లు, ఫోర్లతో వీరవిహారం చేశాడు. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూబె సైతం చేయి వేయడంతో భారత్​ మరో 28 బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. భారత బ్యాట్స్​మెన్ల ధాటికి ప్రత్యర్థి బౌలర్​ జాక్​ ఫోక్స్​ మూడు ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 67 పరుగులు సమర్పించుకున్నాడు. మూడో టీ20 గౌహతి వేదికగా ఈ నెల 25న జరుగుతుంది

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>