epaper
Friday, January 23, 2026
spot_img
epaper

విడుదల కాబోయే భారతీయ ఖైదీల జాబితా అందజేసిన యూఏఈ

కలం, వెబ్​డెస్క్​: యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్(యూఏఈ)​ లోని జైళ్లలోని భారతీయ ఖైదీల్లో 900 మంది త్వరలో స్వదేశానికి చేరుకోనున్నారు. వీరిలో వివిధ కేసుల్లో దీర్ఘకాల శిక్ష అనుభవిస్తున్నవాళ్లు సైతం ఉన్నారు. ఈ మేరకు ఖైదీల వివరాలతో కూడిన జాబితాను యూఏఈ ప్రభుత్వం శుక్రవారం అబుదాబిలోని ఇండియన్​ ఎంబీసీ (UAE – India) కి అందజేసింది.

గతేడాది డిసెంబర్​ 2న జాతీయ వేడుక ‘ఈద్​ అల్​ ఎతిహాద్​’ సందర్భంగా 2,937 మంది ఖైదీలకు యూఏఈ ప్రెసిడెంట్​​ షేక్​ మహ్మద్​ బిన్​ జాయెద్​ అల్​ నహ్యాన్​ క్షమాభిక్ష ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఖైదీలను విడుదల చేయడంతోపాటు వారిని స్వదేశానికి పంపేందుకు అయ్యే ఖర్చంతా యూఏఈనే భరించనున్నట్లు అప్పట్లో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఖైదీలు తమ కుటుంబాలను కలసి సరికొత్త జీవితం ప్రారంభించేలా, వాళ్ల కుటుంబాల్లో ఆనందం నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ఇందులో భాగంగా మొత్తం ఖైదీల్లో తొలి విడతగా 900 మంది పేర్లతో కూడిన జాబితాను భారత్​కు యూఏఈ (UAE – India) అందజేసింది.

కాగా, రెండ్రోజుల కిందట యూఏఈ ప్రెసిడెంట్​ షేక్​ మహ్మద్​ బిన్​ జాయెద్​ అల్​ నహ్యాన్​ భారత్​కు వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. కేవలం మూడు గంటలు మాత్రమే భారత్​లో పర్యటించిన ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయానికి వెళ్లి మరీ ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ రెండు గంటలు చర్చలు జరిపారు. ఇందులో రక్షణ, వాణిజ్యం, ఇంధన వనరులు తదితర ముఖ్యాంశాలు ఉన్నాయి. ఈ క్రమంలో యూఏసీ ప్రెసిడెంట్​ తిరిగి స్వదేశానికి వెళ్లిన వెంటనే.. ఆ దేశ అధికారులు భారతీయ ఖైదీల విడుదల జాబితా అందజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నేడో రేపో ఖైదీల వివరాలను భారత ఎంబీసీ వెల్లడించే అవకాశం ఉంది.

Read Also: అమెజాన్​ ఉద్యోగులకు ముంచుకొస్తున్న లేఆఫ్​ గడువు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>