epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

ఉపా చట్టం.. ఐదేళ్లలో అరెస్టులు 5,690

కలం, వెబ్​డెస్క్​: చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(UAPA) కింద కేసులు భారీగా, శిక్షలు తక్కువగా నమోదవుతున్నాయి. 2019–23 మధ్య ఐదేళ్లలో ఉపా చట్టం కింద రికార్డయిన కేసులు, శిక్షలు వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు కలిగే సంఘటనల్లో భాగమైన వారిని ఉపా చట్టం కింద అరెస్టు చేస్తారు. ఈ చట్టం కింద 2019–23 మధ్య దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 5,690 కేసులు రికార్డవగా, 288 మందికి శిక్షలు పడ్డాయి. అంటే కేవలం 5శాతం మందికి మాత్రమే శిక్ష పడింది.  ఈ మేరకు నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ(ఎన్​ఐఏ5) నివేదిక వెల్లడించింది.

ఇక 2023లో 1,686 మంది ఉపా (UAPA )కింద అరెస్టవగా, వీరిలో 84 మందికి శిక్ష పడింది. ఇది 4.98శాతం. ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువగా కనిపించే జమ్మూ కశ్మీర్​ ప్రాంతంలో  2019–23 మధ్య కాలంతోపాటు 2023 ఏడాదిలోనూ ఉపా కింద శిక్షలు లేవు. అస్సాం, మణిపూర్​, మేఘాలయలో వరుసగా 154, 130, 71 కేసులు 2023లో నమోదవగా, ఈ రాష్ట్రాల్లోనూ శిక్షలు పడలేదు.

యోగి ఆదిత్యనాథ్​ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక ఉత్తరప్రదేశ్​లో ఉగ్రకార్యకలాపాలు, మాఫియా ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ 2023లో ఉపా చట్టం కింద 1,122 కేసులు నమోదయ్యాయి. ఇందులో 75 మందికి (6.68 శాతం) శిక్షలు పడ్డాయి.

Read Also: అవన్నీ కట్టుకథలు, పిట్టకథలు.. సింగరేణి టెండర్ల వివాదంపై భట్టి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>