epaper
Tuesday, November 18, 2025
epaper

సమయపాలన పాటించని అధికారులు.. మంత్రి తుమ్మల ఆగ్రహం

సమయపాలన పాటించని అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు(Minister Tummala) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఉదయం మంత్రి తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొందరు అధికారులు సమయానికి కార్యాలయానికి రాకపోవడం, కార్యాలయ నిర్వహణలో లోపాలు ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తుమ్మల(Minister Tummala) ఉదయం 10 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో హాజరు కాని సిబ్బందిని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ భవనాలు శిథిలావస్థలో ఉండటంతో మండిపడ్డారు. నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయని ఆరోపించారు. క్రమశిక్షణ లేని అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

రైతులకు సేవలు అందించే సంస్థలో ఇలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని, సమయపాలన, పని నిబద్ధత తప్పనిసరి అని స్పష్టం చేశారు. గతంలో ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ డైరెక్టరేట్లలో కూడా మంత్రి ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తే పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.

Read Also: బీహార్ ప్రజలకు సీఎం నితీశ్ కుమార్ వీడియో సందేశం

Follow Us On : Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>